అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటి పోతున్న ఇన్ఫ్లుయెన్సెర్

0
112

అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటిపోతున్న ఇన్‌ఫ్లూయన్సర్స్‌

 

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ సంస్కృతి వేగంగా విస్తరించింది. కానీ కొంత మమంది భావ ప్రకటనా స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటం సమాజానికి ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. భారత రాజ్యాంగం మనకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది, కానీ అది పరిమితులు లేనిది కాదు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నప్పుడు, వారు మాట్లాడే ప్రతి మాట సమాజంపై, ముఖ్యంగా యువతపై బలమైన ముద్ర వేస్తుంది. కేవలం వ్యూస్ కోసం, సంచలనం కోసం దేశ ప్రతిష్టను దిగజార్చడం లేదా మతపరమైన మనోభావాలను గాయపరచడం చేస్తున్నారు. సమాజాన్ని కించ పరుస్తున్నారు.

 

విలువల కంటే క్లిక్ బేట్ కే ప్రాధాన్యత:

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో అటెన్షన్ ఎకానమీ నడుస్తోంది. అంటే ఎవరికైతే ఎక్కువ అటెన్షన్ వస్తుందో వారికి అంత ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దేవుళ్లను కించపరచడం లేదా వ్యవస్థలను తప్పు పట్టడం , వావి వరుసలు లేని జోకుల ద్వారా త్వరగా పాపులారిటీ సంపాదించవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ షార్ట్ కట్ పద్ధతి వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. విద్వేషం పెరగడమే కాకుండా, తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. బాధ్యతాయుతమైన ఇన్‌ఫ్లుయెన్సర్లు సమాజానికి దిశానిర్దేశం చేయాలి కానీ, దారి తప్పించకూడదు.

 

చట్టాలు వర్తిస్తాయి !

 

సోషల్ మీడియా అంటే చట్టాలకు అతీతమైన ప్రపంచం కాదు. ఐటి చట్టం , కొత్తగా వస్తున్న డిజిటల్ మీడియా నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమాధికారానికి, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కోర్టు మెట్లు ఎక్కడం, వారి అకౌంట్లు డిలీట్ అవ్వడం మనం చూస్తున్నాం. వ్యక్తిగత ఎదుగుదల కోరుకోవడంలో తప్పు లేదు కానీ, అది సమాజ క్షేమానికి వ్యతిరేకంగా ఉండకూడదు. నా అన్వేషణ..అన్వేష్ ఒక్కడే కాదు.. చాలా మంది ఉన్నారు.

 

వీక్షకుల బాధ్యత కూడా ముఖ్యం

 

ఇన్‌ఫ్లుయెన్సర్ల దారి తప్పడానికి వీక్షకులు ఇచ్చే ప్రోత్సాహం కూడా ఒక కారణం. వివాదాస్పద కంటెంట్‌ను చూసినా, షేర్ చేసినా వారికి మరింత బలం చేకూరుతుంది. సమాజానికి మేలు చేసే, జ్ఞానాన్ని పంచే వ్యక్తులను ఆదరించడం ,తప్పుడు దారిలో నడిపించే వారిని డిజిటల్ బాయ్ కాట్ ద్వారా తిరస్కరించాలి. అలా చేస్తే సోషల్ మీడియాలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురాగలం. ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ తన కెమెరా ముందు మాట్లాడే ముందు, తన మాట లక్షలాది ఇళ్లలోకి చేరుతుందనే కనీస సామాజిక బాధ్యతను గుర్తించాల్సి ఉంది. సోషల్ మీడియా యుగంలో విలువల్ని కాపాడుకోవడం చాలా కష్టం. కానీ అదే కారణంతో అన్నీ తెంపేసుకుని రోడ్డు మీద పడిపోకూడదు.

Search
Categories
Read More
Andhra Pradesh
పులివెందులలో MP అవినాష్ అరెస్ట్, ఉద్రిక్త పరిస్థితులు
పులివెందుల, ఆంధ్రప్రదేశ్- పులివెందుల పట్టణంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
By Bharat Aawaz 2025-08-12 06:04:08 0 808
Telangana
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
By Sidhu Maroju 2025-10-14 15:21:22 0 154
Tamilnadu
యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025...
By Sidhu Maroju 2025-09-15 17:10:25 0 180
Himachal Pradesh
Pong Dam Crosses Danger Level After Heavy Rain |
The water level at Pong Dam rose by nearly 2 feet following heavy rains, crossing the danger...
By Pooja Patil 2025-09-16 08:35:32 0 173
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|
  మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17...
By Sidhu Maroju 2026-01-01 12:43:55 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com