పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం

0
201

*పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*

 

*మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్*

 

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, భద్రతాయుతంగా నిర్వహించేందుకు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్య కూడళ్లలో, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో, దేవాలయాలు, హోటళ్లు, ప్రధాన రహదారుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు నైట్ ప్యాట్రోలింగ్‌ను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించారు.ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. మండలంలోని ప్రతి జంక్షన్‌ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలన్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, స్టంట్లు వేయడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు..మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఎవరైనా అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శబ్ద కాలుష్యం, గొడవలు, రోడ్లపై గుమిగూడటం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే చర్యలకు అనుమతి లేదన్నారు. యువత తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కోరారు..అనుమానాస్పద లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ, “ప్రజల సహకారంతోనే శాంతియుత నూతన సంవత్సరం వేడుకలు సాధ్యమవుతాయి” అని ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
By Ponnala Srinivasrao 2026-06-08 02:58:30 0 124
Telangana
సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్...
By Sunka Santhosh 2026-07-17 17:27:57 0 49
Nagaland
Municipal Body Merger Officially Recognized
The State Election Commission (SEC) has officially recognized the merger of the Nationalist...
By Dunna Jessicaruth 2026-05-16 07:08:19 0 98
Andhra Pradesh
స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది...
By Pagadala Venkateswar 2026-02-02 07:21:58 0 143
Andhra Pradesh
మదనపల్లె పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలు.
మదనపల్లె పార్టీ కార్యాలయంలో ఆదివారం బహుజన రాజ్యాధికార స్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలు ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-16 02:09:34 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com