సుచిత్ర ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ ఈటెల.|

0
149

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : సుచిత్ర సెంట్రల్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే స్టేషన్ మొదలు పెట్టి సంవత్సరన్నర అయినా నిరుపయోగంగా మారడం పట్ల ఎంపి. ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగంలోకి రావడానికి ఏం చేయాలో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉందని ప్రజలకు తెలియకపోవడం. బస్ స్టేషన్ చాలా దూరం ఉండడం. స్టేషన్ కి రావడానికి సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఎక్కువమంది ప్రయాణికులు రావడం లేదని అధికారులు వివరించారు. 

 

చర్లపల్లి - ఘట్కేసర్, 

లింగంపల్లి - రామచంద్రపురం,

రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి.

ఈ మార్గంలో రైళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలని ఉన్నత అధికారులను కోరతామని ఈటల రాజేందర్ తెలిపారు.

 

ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు సదా కేశవ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, మల్ల రెడ్డి,భరత్ సింహ రెడ్డి, సుబ్బా రావు, రాజి రెడ్డి , మల్లికార్జున్ సూర్య, మురళి కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 511
Andhra Pradesh
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ...
By Pagadala Venkateswar 2026-01-23 06:49:03 0 132
Andhra Pradesh
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
By Kothuru Murali 2025-12-29 13:20:02 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com