పలుకూరు యువకుల హైటెక్ మోసం

0
205

పలుకూరు యువకుల హైటెక్ మోసం

కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్ లో, IPL టికెట్ల దందాకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. 

ఘట్టమనేని అశోక్ (రియల్ ఎస్టేట్ ఏజెంట్) కంకణాల దినేష్ (చార్టెడ్ అకౌంటెంట్), సింగమనేని వేణుమాధవ్ (బీటెక్).. వీరు ముగ్గురిది పాతికేళ్ల వయసు. వీరిలో ఘట్టమనేని అశోక్ మోసాలు చేయడంలో దిట్ట. తక్కువ టైమ్ లో, ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో, తమిళనాడుకు చెందిన మరో ముగ్గురితో కలిసి టీంగా ఏర్పడి మోసాలకు పాల్పడ్డారు. 

ఐపీఎల్ టిక్కెట్లకు యువతలో మంచి డిమాండ్ ఉంది. దీనిని అడ్డం పెట్టుకుని.. విఐపి లెటర్లను అక్రమంగా సంపాదించి, వాటి ద్వారా వచ్చే టికెట్లను అమ్మాలని ప్లాన్ వేశారు. గవర్నర్లు, జడ్జీలు, మంత్రుల పేర్లతో హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ లకు మెయిల్స్ పెట్టారు. ప్రజాప్రతినిధిలే స్వయంగా టిక్కెట్లు అడుగుతున్నారని భావించి, క్రికెట్ అసోసియేషన్ వాళ్లు, కాంప్లిమెంటరీ ఐపీఎల్ టికెట్లను పంపించారు. ఆ టికెట్లను పలుకూరు యువకులు బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు. 

ఈనెల 3వ తేదీన, హైదరాబాద్ - ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద ఈ ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్కటి 22 వేల విలువచేసే 5 టికెట్లు, మహేంద్ర థార్ వాహనం, 5 ఫోన్లు, కొన్ని VIP ల లెటర్ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన మిగతా ముగ్గురు పరారయ్యారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఫోటోలు దిగటం, వారికి విలువైన బహుమతులు ఇస్తూ సన్నిహితంగా ఉండడం... ఘట్టమనేని అశోక్ కు బాగా అలవాటు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల పేరుతో లెటర్ ప్యాడ్ లను తయారుచేసి టీటీడీ దర్శనాలకు కూడా ఉపయోగిస్తుంటాడని పలువురు చెబుతున్నారు. పలుకూరుకు చెందిన మిగిలిన ఇద్దరు అమాయకులని, వారిని ట్రాప్ చేసి ఈ దందాలో ఇరికించినట్లు గ్రామస్తులు అంటున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది మౌర్యా రెడ్డి
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-22 06:40:38 0 228
Andhra Pradesh
మదనపల్లిలో కబడ్డీ పోటీలు ఘనంగా ముగింపు.
మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి....
By Pagadala Venkateswar 2026-04-20 03:29:09 0 105
Bharat Aawaz
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special...
By Benguluri Madhubabu 2026-07-09 12:28:09 0 95
Andhra Pradesh
పుంగనూరులో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ...
By Kothuru Murali 2026-05-20 16:21:38 0 76
Andhra Pradesh
యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘‍♂️
నమస్కారం మిత్రులారా 🙏 "యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘‍♂️ ఈరోజు మా తంగిరాలపల్లి...
By Chennaiah Kati 2026-06-21 11:03:42 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com