నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి

0
243

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి

అమరావతి, డిసెంబర్ 31: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ  ప్రత్యేక అనుమతులను అనుసరించి ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, 2025,  జనవరి 1, 2026 రాత్రుల్లో అర్ధరాత్రి 12.00 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు. అలాగే 2B (బార్లు), సి 1 (ఇన్-హౌస్), ఈపిఐ(ఈవెంట్ పర్మిట్),  టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించడానికి, రెస్టారెంట్ సర్వీస్ లకు అనుమతి పొందాయి.

గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలులో ఉన్న విధానానికి అనుగుణంగా ఈ సడలింపు ఇవ్వబడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం లేదా అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఈ ఆదేశాల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

 

#నరేంద్ర

Like
1
Search
Categories
Read More
Telangana
Cm revanth reddy at ruthu ashirwad sabha
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్...
By G k Nookala 2026-07-10 10:20:32 0 89
Telangana
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం
కరీంనగర్ జిల్లా  ‎   బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు...
By Ponnala Srinivasrao 2026-05-05 13:29:22 0 141
Telangana
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల...
By Pinnehasan Odela 2026-01-10 12:10:32 0 225
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:22:01 0 155
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com