నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి

0
244

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి

అమరావతి, డిసెంబర్ 31: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ  ప్రత్యేక అనుమతులను అనుసరించి ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, 2025,  జనవరి 1, 2026 రాత్రుల్లో అర్ధరాత్రి 12.00 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు. అలాగే 2B (బార్లు), సి 1 (ఇన్-హౌస్), ఈపిఐ(ఈవెంట్ పర్మిట్),  టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించడానికి, రెస్టారెంట్ సర్వీస్ లకు అనుమతి పొందాయి.

గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలులో ఉన్న విధానానికి అనుగుణంగా ఈ సడలింపు ఇవ్వబడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం లేదా అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఈ ఆదేశాల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

 

#నరేంద్ర

Like
1
Search
Categories
Read More
Telangana
కేంద్రంపై గళమెత్తిన కార్మికులు- అల్వాల్ లో భారీ నిరసన .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను...
By Sidhu Maroju 2026-02-12 08:49:45 0 205
Telangana
చెరువుల రక్షణకు భారీ ఆఫర్: భూములిస్తే 300% వరకు టీడీఆర్.. సర్కార్ కొత్త ఉత్తర్వులు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం భవన...
By Sidhu Maroju 2026-03-22 10:39:18 0 189
Andhra Pradesh
ఏ కొత్తకోట దగ్గర ఆక్సిడెంట వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం , ఏ కొత్తకోట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ద్విచక్ర...
By Kothuru Murali 2026-01-01 12:37:33 0 205
Andhra Pradesh
పుంగనూరు: రాగి తీగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ తన వ్యవసాయ...
By Kothuru Murali 2026-04-21 14:49:14 0 104
Andhra Pradesh
కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన...
By Jeeru Kumar 2026-03-01 06:31:32 0 967
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com