తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం

0
206

*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*

 

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దివ్యదర్శనం చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, స్వామివారి అనుగ్రహంతో ఈ పవిత్ర రోజున ప్రత్యేక దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

కోటి పుణ్యాలకు నెలవైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా వేకువజామున కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సద్గుణాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నిండి ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

 

తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు అలంకరణ, ఇతర భక్తులకు సౌకర్యాలు, చాలా ప్రత్యేకంగా చేశారని, తిరుమల అధికారులకు, పాలక మండలికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు! 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మహిళపై అత్యాచారం.. కేసు నమోదు.
అన్నమయ్య జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
By Pagadala Venkateswar 2026-03-24 03:30:15 0 152
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 155
Sports
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-30 10:49:37 0 198
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:38:31 0 280
Andhra Pradesh
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-01-14 07:54:50 1 915
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com