తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం

0
209

*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*

 

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దివ్యదర్శనం చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, స్వామివారి అనుగ్రహంతో ఈ పవిత్ర రోజున ప్రత్యేక దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

కోటి పుణ్యాలకు నెలవైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా వేకువజామున కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సద్గుణాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నిండి ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

 

తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు అలంకరణ, ఇతర భక్తులకు సౌకర్యాలు, చాలా ప్రత్యేకంగా చేశారని, తిరుమల అధికారులకు, పాలక మండలికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు! 

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-07-10 16:35:20 0 60
Business & Finance
Kerala Strengthens Ease of Doing Business Reforms
Kerala continues to enhance its business environment by implementing reforms that simplify...
By Navya Sree 2026-07-04 05:58:39 0 33
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-05 06:17:11 0 100
Andhra Pradesh
మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే...
By Gadiyapudi Narendra 2026-02-17 15:50:05 0 182
Telangana
ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ...
By Sidhu Maroju 2026-02-19 17:16:53 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com