ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|

0
213

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి  వేడుకలు అల్వాల్‌ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, శివ భక్తులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం పరాయి పాలనలో మగ్గిపోతున్న సమయంలో ధైర్యసాహసాలతో 'స్వరాజ్యాన్ని' స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ అని కొనియాడారు. కేవలం యుద్ధ తంత్రంలోనే కాకుండా, ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పరిపాలన అందించిన మహనీయుడని పేర్కొన్నారు. నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని, దేశభక్తితో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో  మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్. మేడ్చల్ జిల్లా అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి,   డివిజన్ ల ప్రసిడెంట్ లు, కార్తిక్ గౌడ్. శ్రీదర్ రెడ్డి. అజయ్ రెడ్డి. తూప్రాన్ లక్ష్మణ్. అనిల్. కరుణశ్రీ. సుజాత.రవి కిరణ్. రాజేంద్రప్రసాద్. మరియు బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక...
By Pagadala Venkateswar 2026-04-09 04:46:36 0 205
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 139
Andhra Pradesh
డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*  *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*   *డిసెంబర్ 22న ప్రజా సమస్యల...
By Rajini Kumari 2025-12-21 12:25:54 0 247
Andhra Pradesh
ప్రతి అభివృద్ధిలో చీరాల రోటరీ క్లబ్ ముందుంటుంది
నేడు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంటు జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో...
By Vadlamudi NagaVenkat 2026-04-09 12:45:23 0 164
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com