శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
156

*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*శ్రీ కొండలమ్మ అమ్మవారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన....ఎమ్మెల్యే రాము*

 

గుడివాడ డిసెంబర్ 30: శ్రీ కొండలమ్మ వారి కరుణాకటాక్షాలతో కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.

 

ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థాన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ఆవిష్కరించారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము , కూటమి నాయకులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి కంకణాలు కట్టి ప్రసాదం అందించారు.

 

అమ్మవారి ఆశీస్సులతో గడిచిన ఏడాది కాలంలో గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. కొత్త సంవత్సరంలో కూడా గుడివాడ అభివృద్ధి పనులు అమ్మవారి దీవెనలతో దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఆలయ ఈ.వో ఆకుల కొండలరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు,పండ్రాజు సాంబశివరావు,మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, రామిదేని వేణు, పెద్దూ వీరభద్రరావు, యార్లగడ్డ సుధారాణి, సింగవరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ
బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన...
By Mobbu Venkatramana 2026-02-18 14:37:20 0 207
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 134
Bharat Aawaz
"The Silent Struggle – How Discrimination Still Shadows Equality"
Article 14 of the Indian Constitution promises equality before law. But is this promise felt in...
By Citizen Rights Council 2025-07-24 06:49:51 0 1K
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 143
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com