రాజీవ్ గృహకల్పలో విద్యుత్ సెగ- మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కాలనీవాసులు.|

0
151

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప కాలనీలో నెలకొన్న విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారం కోసం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిశారు.షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

కాలనీ వాసుల కథనం ప్రకారం.. రాజీవ్ గృహకల్పలో తాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్న విద్యుత్ మోటార్లకు సంబంధించి భారీగా బిల్లులు బకాయి పడ్డాయి. గతంలో ఉన్న కమిటీ ప్రతి ఇంటి నుండి కరెంట్ బిల్లుల కోసం నగదు వసూలు చేసినప్పటికీ, ఆ మొత్తాన్ని విద్యుత్ శాఖకు చెల్లించడంలో వైఫల్యం చెందారని బాధితులు తెలిపారు.

బకాయిలు చెల్లించని పక్షంలో మోటార్ల కనెక్షన్లను కట్ చేస్తామని విద్యుత్ అధికారులు హెచ్చరించడంతో, కాలనీలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కాలనీ వాసుల సమస్యను సావధానంగా విన్న కూన శ్రీశైలం గౌడ్ సానుకూలంగా స్పందించారు. వేలాది కుటుంబాలు నివసించే రాజీవ్ గృహకల్పలో తాగునీటి సరఫరా నిలిచిపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఈ విషయంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, కనెక్షన్లు కట్ కాకుండా చూస్తానని, బకాయిల చెల్లింపు విషయంలో తగిన వెసులుబాటు కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్న శ్రీశైలం గౌడ్ కు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిజాంపేట్ >  భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల...
By Sidhu Maroju 2025-11-28 16:30:09 0 177
Telangana
నిజామాబాద్: డిసియం వ్యాన్ ది......ఒకరి పరిస్థితి విషమం
దిసియం వ్యాన్ డికోని ముగురు తివ్రగాయల పలినట్లూరురల్ SHO శ్రీనివాస్ తిలిప్యారు. రూరల్ పోలీ స్టేషన్...
By Sadaq Sadaq 2026-02-28 00:02:24 0 132
Andhra Pradesh
బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలు
సీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన...
By Boiena Rajesh 2026-03-26 14:22:42 0 155
Andhra Pradesh
Vijayasai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి ఈడీ విచారణ.
ఏపీ మద్యం స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ హైదరాబాద్‌లో దాదాపు 7 గంటల పాటు సాగిన...
By Pagadala Venkateswar 2026-01-22 15:02:17 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com