బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|

0
187

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు) ఆధునీకరణ, సుందరీకరణ పనులను హెచ్ఎండిఏ ద్వారా వేగవంతం చేయాలని, చెరువు కట్ట పటిష్టతకు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆమె అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వర్షాకాలంలో బైరం చెరువు కట్ట తెగిపోవడంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అప్పట్లో తృటిలో ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందుస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

బంద్ నిర్మాణం, స్టోన్ పిచ్చింగ్, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన చెరువు చుట్టూ పటిష్టమైన బంద్ నిర్మించాలని, దానికి స్టోన్ పిచ్చింగ్ (రాళ్లతో పేర్చడం) ద్వారా రక్షణ కల్పించాలని సూచించారు. చెరువు యొక్క ఇన్-లెట్స్ (నీరు వచ్చే దారులు) అవుట్-లెట్స్ (నీరు వెళ్లే దారులు)ను ఎస్.ఎన్.డి.పి నాళాలకు అనుసంధానం చేయాలని కోరారు. తద్వారా అదనపు నీరు నివాస ప్రాంతాల మీదకు రాకుండా నేరుగా నాళాల ద్వారా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు దాసి నాగరాజ, బీజేపీ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం, హెచ్ఎండిఏ అధికారులు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
International
“⚠️ పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?”
ఈరోజు ఉదయం వచ్చిన తాజా వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే...
By Thokala Sivaji 2026-03-25 01:56:37 0 894
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజల జీవితాలకు మెరుగు !!
కర్నూలు : తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో...
By Hari Krishna 2025-12-21 09:10:11 0 203
Andhra Pradesh
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు...
By Eslavath RameshNaik 2026-01-26 07:47:33 0 493
Andhra Pradesh
తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ...
By Ratna Sekhar 2026-03-10 19:48:11 0 955
Kerala
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
By Bharat Aawaz 2025-07-17 08:36:02 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com