మరో ఇద్దరు రౌడీ షీట్టర్ల జిల్లా బహిష్కరణ : కర్నూలు ఎస్పీ

0
254

కర్నూలు : 
కర్నూలు జిల్లా...

మరో ఇద్దరూ రౌడీ షీటర్ ల పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి...

...ఇప్పటివరకు 5 మంది జిల్లా బహిష్కరణ .

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి  ఐఏఎస్ గారు.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు .

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని షరీన్ నగర్లో  నివాసముండే  వడ్డే రేవంత్ కుమార్ , వడ్డే శివ కుమార్ లు  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో  వీరిద్దరి  పై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి ఐఏఎస్ గారు ఈ రోజు జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. 

కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 

 వడ్డే రేవంత్ కుమార్  పై రౌడీషీట్ నెంబర్ 387 ఉంది. 

వడ్డే  శివ కుమార్ పై రౌడీషీట్ నెంబర్ 388 ఉంది. 

వీరిద్దరూ 5 క్రిమినల్ కేసులలో నిందితులుగా ఉన్నారు. 

అందులో హత్యలు, దోపిడీలు,  ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు,  జులుం కేసులు, హత్యాయత్నం కేసులు , ఇలా పలు రకాల కేసులు వీరిద్దరి పై నమోదయి ఉన్నాయి. 

  పై తెలిపిన కేసుల్లో పలు మార్లు వీరిద్దరూ రిమాండ్ కు వెళ్లి ఖైదు చేయబడినప్పటికీ కూడా ఇద్దరి ప్రవర్తనలో ఎటువంటిమార్పు రాకపోగా,  మరి ఎక్కువగా  వివిధ  రకాల కేసులలో పాల్గొంటున్నారని  కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి యొక్క ప్రతిపాదనల మేరకు వీరి యొక్క క్రిమినల్ రికార్డులను నిశితంగా పరిశీలించిన మీదట జిల్లా కలెక్టర్  డా. ఏ. సిరి ఐఏఎస్ గారు ఈ రోజున వీరిద్దరి మీద జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  గారు మాట్లాడుతూ...

జిల్లాలో ఇప్పటివరకు చెడు నడత కలిగిన 

ఐదుగురి పై 

1)వడ్డే రామాంజనేయులు 

 2) పటాన్ ఇమ్రాన్ ఖాన్ 

3) వడ్డే తులసి కుమార్

4) వడ్డే రేవంత్ కుమార్

5) వడ్డే శివ కుమార్ )

జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో ఇప్పటినుండి ఎవరైనా రౌడీయిజంతో  అరాచక శక్తులుగా  మారి , ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ,  శాంతిభద్రతలకు విఘాతం కలగజేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అటువంటి వారిపై జిల్లా బహిష్కరణతో పాటు గా పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని,  ప్రశాంతంగా, మంచిగా, బుద్ధిగా జీవించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.

ఇటువంటి చెడు నడత కలిగిన  చాలామంది పేర్లు  జిల్లా బహిష్కరణ  పరిశీలనలో ఉన్నాయని, మంచి ప్రవర్తనతో జీవించాలని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు హెచ్చరించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: చెక్ బౌన్స్.. భార్యాభర్తలకు శిక్ష ..
చిల్లను చెక్కు ఇచ్చిన కేసులో రాచపూడి లలిత లక్ష్మీనారాయణ దంపతులు ఏడాది జైలు శిక్ష, తీసుకున్న రూ.60...
By Bonagiri RaviShankar 2026-06-10 07:22:16 0 185
Andhra Pradesh
Cabinet meeting updates
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి...
By G k Nookala 2026-02-25 08:18:17 0 165
Andhra Pradesh
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...
By Gadiyapudi Narendra 2026-03-17 11:50:35 0 455
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 332
Andhra Pradesh
నత్తనడకగా పోలవరం కాలువ పనులు...
ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు...
By BABJI DADALA 2026-02-04 05:07:54 0 472
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com