ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ

0
112

*పత్రికా ప్రకటన*

*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*

 

*ఆరోగ్యం, కాలుష్య ర‌హిత భ‌విత‌కు సైకిల్ సవారీ..*

- *పెడ‌ల్ ఫ‌ర్ ఫిట్‌నెస్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలి*

- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*

 

ఆరోగ్య‌క‌ర జీవితంతో పాటు కాలుష్య ర‌హిత భ‌విష్య‌త్తుకు సైకిల్ స‌వారీ దోహ‌దం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్‌ను ఓ ఆనంద‌క‌ర అల‌వాటుగా చేసుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వ‌ర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండేస్ సైకిల్ ర‌న్ కార్య‌క్ర‌మం న‌గ‌రంలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద జ‌రిగింది. ఇందులో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సైక్లింగ్‌ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికిపైగా చిన్నారుల‌తో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో క‌లిసి బెంజ్ స‌ర్కిల్‌, పాలీ క్లినిక్ రోడ్డు, పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌, రెడ్ స‌ర్కిల్ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ శారీర‌క ఆరోగ్యం ఎంత ముఖ్య‌మో మాన‌సిక ఆరోగ్య‌మూ అంతే ముఖ్య‌మ‌ని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌డంతో పాటు భావిత‌రాల‌కు కాలుష్య ర‌హిత ప‌ర్యావ‌ర‌ణాన్ని వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు ప్ర‌తిఒక్క‌రూ సైక్లింగ్ ను హాబీగా మార్చుకొని ముందుకువెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. అందుకే అవగాహన పెంచుకొని సైక్లింగ్ ను అభిరుచిగా మార్చుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో డీఎస్‌డీవో కాక‌ర్ల కోటేశ్వ‌ర‌రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు సుగుణ‌రావు, కోచ్ రాహుల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు :అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు
పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ...
By Kothuru Murali 2026-01-22 13:03:51 0 124
Telangana
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....
By Pinnehasan Odela 2026-01-16 15:06:03 0 264
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 91
Andhra Pradesh
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
By Rajini Kumari 2025-12-27 11:06:49 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com