ప్రభుత్వ హాస్పిటల్లో 35 లక్షల అల్ట్రాసౌండ్ ల్యాబ్ ప్రారంభం

0
208

నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.

 

నందిగామ పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో శనివారం నాడు రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అల్ట్రా సౌండ్ ల్యాబ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, కూటమి నేతలు, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్ ల్యాబ్‌లను మంజూరు చేయగా అందులో నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్ ఒకటిగా ఎంపిక కావడం ఆనందకరమని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వైద్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి నందిగామకు అల్ట్రా సౌండ్ ల్యాబ్ మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అల్ట్రా సౌండ్ ల్యాబ్ ద్వారా గర్భిణులు, మహిళలు, పేద ప్రజలకు స్థానికంగానే కీలక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె కోరారు, అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, వైద్యులు, అధికారులు, కూటమి నేతలు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-05-23 07:23:29 0 544
Andhra Pradesh
తిరుపతి లో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు
తిరుపతిలో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.చాలా ప్రాంతాల్లో పేదలకు అన్నదానం...
By Karapati Gopi 2026-06-20 10:41:35 0 246
Andhra Pradesh
కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు...
By Ratna Sekhar 2026-02-19 20:16:08 0 1K
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు.
చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 46.85 లక్షల మంది...
By Pagadala Venkateswar 2026-06-20 13:37:20 0 57
Andhra Pradesh
సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ సందర్శనకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు.
📍 నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ – అఖిల భారత...
By John Baji 2026-01-06 12:44:35 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com