గుంటూరు జిల్లాలో 53 లక్షల విలువైన సెల్ఫోన్లు రికవరీ.బాధితులకు అందించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు

0
286

*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*//సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న / దొంగిలించబడిన సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు,.//*_ • పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన సెల్‌ఫోన్లను రికవరీ చేసి, ఉచితంగా బాధితులకు అందజేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు. • ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్ల 53 లక్షల విలువైన మొత్తం 3,769 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. • సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. 👉 ఈ రోజు (26.12.2025) గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న / దొంగిలించబడిన సెల్‌ఫోన్లను గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బాధితులకు అందజేశారు. *👉 ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…* 🔹 సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తించి సంబంధిత బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 🔹 ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 8688831574, లేదా CEIR వెబ్‌సైట్, లేదా జిల్లా సైబర్ సెల్‌, లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 🔹 నేటి రోజుల్లో సెల్‌ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అధిక లాభాలు, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు వంటి ఆశలు చూపుతూ ప్రజలను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతాల నుండి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే వాటిని బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో గానీ, లేదా జాతీయ సైబర్ భద్రత టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 🔹 సెల్‌ఫోన్ల రికవరీలో విశేషంగా కృషి చేసిన ఐటీ కోర్ సీఐ శ్రీ నిషార్ భాష గారు, కానిస్టేబుళ్లు శ్రీధర్ గారు, మానస గారు, ఇమామ్ గారు, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ గారు, కానిస్టేబుల్ కరీముల్లా గారులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు
నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్...
By Gujile Ramu 2026-04-23 16:42:20 0 200
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31న సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని...
By Kothuru Murali 2026-01-27 09:29:40 0 177
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-08 05:29:48 0 111
Jharkhand
Jharkhand Forest Conservation and Wildlife Protection
Jharkhand is strengthening forest conservation and wildlife protection through initiatives aimed...
By Fathima Safa 2026-06-24 09:40:47 0 99
Andhra Pradesh
విజయవాడ పివిపి మాల్ రోడ్డు విస్తరణ మీ అభిప్రాయాలు తెలపండి
విజయవాడ నగరపాలక సంస్థ  24-01-2026        *పివిపి మాల్ రోడ్ విస్తరణ...
By Rajini Kumari 2026-01-25 11:15:19 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com