గుంటూరు జిల్లాలో గంజాయి మరియు ఇతరత్రా మారకద్రవ్యాలు విద్యార్థుల అవగాహన రాష్ డ్రైవింగ్ హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ జరిగినది. గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో జరిగినవి...

0
219

*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*// “సంకల్పం” కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులు, ప్రజలకు విస్తృత అవగాహన – ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ,.//*_ 📍గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత, సమాజం ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను నివారించడమే లక్ష్యంగా, గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాలు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో, “సంకల్పం” కార్యక్రమం భాగంగా గుంటూరు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 📍ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, అలాగే సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి లేదా డ్రగ్స్ విక్రయాలు/రవాణా చేస్తున్న సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. 📍అదేవిధంగా, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం అంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 📍గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంతో పాటు, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ తరహా అవగాహన కార్యక్రమాలు మరియు ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. 📍ఈ రోజు దుగ్గిరాల, పెదకాకాని, పొన్నూరు రూరల్, పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, తెనాలి త్రీటౌన్, కాకుమాను, ప్రత్తిపాడు, చేబ్రోలు మొదలగు పోలీస్ స్టేషన్లలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది"సంకల్పం" కార్యక్రమం నిర్వహించారు.

Search
Categories
Read More
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 788
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 238
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 182
Telangana
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|
     సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి...
By Sidhu Maroju 2025-12-17 16:22:00 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com