ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచ‌ల‌నం.. స్టేట్ టాప‌ర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!

0
102

599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్

ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం

పరీక్షలకు ముందు టైఫాయిడ్ వచ్చినా సత్తా చాటిన టాపర్

రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది సాధించిన 81.14 శాతంతో పోలిస్తే ఈసారి ఫలితాలు 4.15 శాతం మెరుగుపడటం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.90 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 82.68 శాతం మంది బాలురు పాసయ్యారు. అంటే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 5.22 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. అంతేగాక‌ పాసైన వారిలో 83.69శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులవడం విశేషం.

 

 రాష్ట్ర టాపర్‌గా విశాఖకు చెందిన కె. జ్ఞానేశ్వరి

ఈ ఫలితాల్లో విశాఖపట్నానికి చెందిన కె. జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించారు. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖ ఎన్ఏడీలోని శ్రీచైతన్య స్కూల్‌లో చదివిన జ్ఞానేశ్వరి, కేవలం ఒక్క మార్కుతో 600 మార్కుల లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. ఆంగ్లంలో ఆమెకు ఒక్క మార్కు తగ్గింది.

 

జ్ఞానేశ్వరి తండ్రి కె. శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి భారతి విశాఖ నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగినిగా ఉన్నారు. అయితే, ఇంతటి ఘన విజయం సాధించడానికి ముందు జ్ఞానేశ్వరి ఒక పెద్ద సవాలును ఎదుర్కొన్నారు. పరీక్షలకు ముందు టైఫాయిడ్ బారిన పడటంతో ఆందోళన చెందినా, ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరయ్యారు. పట్టుదలతో చదివి అద్భుతమైన మార్కులు సాధించారు. భవిష్యత్తులో ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ తీసుకుని, డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని జ్ఞానేశ్వరి తెలిపారు.

 

కాగా, గతేడాది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. అయితే, ఈ ఏడాది ఆ రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. అత్యధికంగా 599 మార్కులే వచ్చాయి.

Search
Categories
Read More
West Bengal
West Bengal Plans Second Airport Near Kalyani Region
The West Bengal government has announced plans to develop a second greenfield airport near...
By Navya Sree 2026-06-26 06:18:43 0 35
Andhra Pradesh
అంగన్‌వాడీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని...
By Pagadala Venkateswar 2026-06-11 05:17:04 0 61
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 213
SURAKSHA
Odisha Police Today: Service Beyond Duty Hours
 Odisha Police officers proved humanity again today in Bhubaneswar and Cuttack. They...
By Kalaga Sailaja 2026-07-06 07:14:57 0 126
Andhra Pradesh
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...
By Boiena Rajesh 2026-04-28 03:03:43 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com