"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|

0
266

సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం నిలిచింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం తన మిత్రుడు గిరిధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారులు, ప్రయాణీకులకు చల్లని తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 

ఈ సేవా కార్యక్రమం చూసి ప్రేరణ పొందిన తన స్నేహితుడు గిరిధర్ కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సామాజిక బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది ముందుకు వచ్చి చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సాంబశివ, ఆనంద్, ధనుశ్రీ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
దేవుడు శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు తిరుపతి లడ్డు పై గద్దె రామ్మోహన్ నిరసన
*దేవుడి శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు* *తిరుమలలో లడ్డూ కల్తీపై తూర్పు శాసనసభ్యులు గద్దె...
By Rajini Kumari 2026-01-29 13:46:18 0 213
SURAKSHA
Solomon Arokiaraj, IAS: Leading Good Governance
A Distinguished Civil Servant Committed to Transparent Administration, Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-13 11:01:15 0 79
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 325
Andhra Pradesh
విద్యుత్ ఘాతం ప్రమాదటపు అంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు
*ప్రెస్ నోట్*    ది.30.05.2026, విజయవాడ.   ⚡ *విద్యుత్ ఘాతం ప్రమాదపుటంచుల్లో...
By Rajini Kumari 2026-05-30 12:14:02 0 117
Telangana
నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.....
  ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....! భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-11 05:20:08 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com