కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగ వర్ధంతి కార్యక్రమం

0
138

*వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం*

 

*కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి కార్యక్రమం*

 

*మంగళగిరి:*

బడుగు, బలహీన వర్గాల నాయకుడు దివంగత స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని కాపు సంఘం నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి కాపు సంఘం నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహన రంగా చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు అండగా తాము నిలబడతామని తెలిపారు. జై కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాపు సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహా నాయకుడు అని తెలిపారు. పార్టీలకతీతంగా వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో, జనసేన నాయకులు అనిల్ బాబు, శివ నాగేంద్రం, నారిశెట్టి చంద్రశేఖర్, కాపు సంఘం నాయకులు తులం సాంబశివరావు, ఇండ్ల సత్యం, బత్తుల గణపతి, యుగంధర్, పోతన చిరంజీవి, నాగేశ్వరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
By Bharat Aawaz 2025-08-12 12:57:28 0 831
Andhra Pradesh
అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్
*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*   అమరావతి: అమరావతిలో...
By Rajini Kumari 2026-03-13 13:38:45 0 99
Andhra Pradesh
చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది......
చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య...
By Gadiyapudi Narendra 2026-02-12 12:49:39 0 118
Telangana
నిజామాబాద్. శ్రీ జండా బాలాజీ ఆలయం ముసివేత
 నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo...
By Sadaq Sadaq 2026-03-03 08:31:27 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com