14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్

0
152

*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం*

*14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*రూ.15 వేల విలువ చేసే తోపుడు బండిని నిరుపేద మహిళకు ఉచితంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*++++*

           కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి క్రమం తప్పకుండా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి ఫించన్లు అందచేస్తున్నామని చెప్పారు. 

 

సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌లోని పటమట రామాలయం దగ్గర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు. డివిజన్‌లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన గణేషుల పార్వతికి జీవనోపాధి నిమిత్తం రూ.15 వేల విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో కోనుగోలు చేసి అమెకు ఉచితంగా అందచేశారు.  

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్ళి క్రమం తప్పకుండా ఫించన్లు అందచేస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీ సెలవు రోజు అయితే ముందు రోజునే ఫించన్లు అందచేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఒక రోజులోనే నూటికి నూరు శాతం పింఛన్లను సచివాలయ ఉద్యోగుల అందచేస్తున్నారని చెప్పారు. పురుషులు సంపాదించిన సొమ్మును ఇంటి ఖర్చులకు కాకుండా వారి వ్యక్తిగతంగా చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నారని, అందువల్ల మగవాళ్ళ అలవాట్లలో మార్పులు రావాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్ముతోనే కొంత మంది మహిళలు ఇంటి ఖర్చులను నిర్వహిస్తున్నారని, అందువల్ల మద్యానికి బానిసలు కాకుండా పురుషులు ఇంటి నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపగలమని అన్నారు. పురుషులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి అండగా ఉంటూ పేదరికం నుంచి బయటపడాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్ణ రమేష్, పోతంశెట్టి నాగేశ్వరరావు, యడ్లపల్లి నాగరాజు, గరికపాటి బద్రి, డాంగే కుమారి, రామాయణపు సాంబయ్య, రేపాకుల ప్రసాద్, చిట్టా నిర్మల, షేక్‌ ఫాతిమా, పొట్లూరి రవీంద్ర, పోతిరెడ్డి వెంకట్రావ్, వెంకన్న, కెల్లా రమేష్‌ నాయడు, వీర్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tripura
Tripura's E-Governance Drive Transforming Public Services
Tripura is accelerating its digital governance and e-governance initiatives to make public...
By Fathima Safa 2026-06-25 09:25:42 0 64
Andhra Pradesh
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి  గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని...
By Shyamala Yadagiri 2026-03-27 03:10:32 0 267
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:09 0 480
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 212
Andhra Pradesh
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
భద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు...
By Shyamala Yadagiri 2026-03-29 04:47:17 0 348
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com