వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి

0
176

విజయవాడ

26-12-2025

 

ప్రచురణార్ధం

 

*వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి*

 

*పలుచోట్ల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*

 

*నేటికీ కూడా ప్రజల గుండెల్లో పాతుకుపోయిన వ్యక్తి వంగవీటి మోహన రంగా - వెలంపల్లి శ్రీనివాసరావు*

 

పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులు పలుచోట్ల ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమాలలో మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా గారి విగ్రహానికి మరియు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 

 

స్థానిక 44వ డివిజన్ చెరువు సెంటర్ లోని వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద వైసిపి నాయకులు గొంది ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు

 

స్థానిక 47వ డివిజన్ కుండల మార్కెట్ వద్ద వైసిపి నాయకులు కూరాకుల నాగ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణి చేసారు

 

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. రంగా గారు మరణించి నేటికి 37 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అన్నారు. ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటంలో రంగ గారు హత్యకు గురయ్యారన్నారు.హత్యకు గురై 37 సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం వంగవీటి మోహన రంగ గారిదన్నారు.

 

ఈ కార్యక్రమాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత...
By Prashanth Goindla 2025-12-26 05:09:18 0 331
Andhra Pradesh
మార్కాపురం బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాదంలో పలువురు సజీవ...
By Benguluri Madhubabu 2026-03-26 04:55:43 0 166
Andhra Pradesh
​బాధితులకు భరోసా: ప్రజా సమస్యల వేదికలో జిల్లా ఎస్పీ.
మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-10 04:37:54 0 113
Telangana
భద్రాచలం బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా...
By Lakavath Kiran 2026-03-31 12:58:54 0 310
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com