వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి

0
209

విజయవాడ

26-12-2025

 

ప్రచురణార్ధం

 

*వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి*

 

*పలుచోట్ల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*

 

*నేటికీ కూడా ప్రజల గుండెల్లో పాతుకుపోయిన వ్యక్తి వంగవీటి మోహన రంగా - వెలంపల్లి శ్రీనివాసరావు*

 

పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులు పలుచోట్ల ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమాలలో మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా గారి విగ్రహానికి మరియు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 

 

స్థానిక 44వ డివిజన్ చెరువు సెంటర్ లోని వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద వైసిపి నాయకులు గొంది ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు

 

స్థానిక 47వ డివిజన్ కుండల మార్కెట్ వద్ద వైసిపి నాయకులు కూరాకుల నాగ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణి చేసారు

 

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. రంగా గారు మరణించి నేటికి 37 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అన్నారు. ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటంలో రంగ గారు హత్యకు గురయ్యారన్నారు.హత్యకు గురై 37 సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం వంగవీటి మోహన రంగ గారిదన్నారు.

 

ఈ కార్యక్రమాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
RTG సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపైCM చంద్రబాబు సమీక్ష
*Press Release*   *తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి*   *మూడు రీజియన్లల్లో...
By Rajini Kumari 2025-12-23 07:58:44 0 215
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 266
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే నసీర్ మెడికల్ కాలేజీ ల పీ పీ పీ పై ప్రజలు ఆలోచించండి
*మెడికల్ కాలేజీల పీపీపీపై ప్రజలు ఆలోచించండి* * సంతకాల పేరుతో సైకోల మాటల నమ్మకండి * జగన్ ను...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:11:14 0 233
Andhra Pradesh
రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల...
By Pagadala Venkateswar 2026-02-24 06:48:39 1 208
Telangana
అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం...
By Ponnala Srinivasrao 2026-05-27 04:15:49 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com