గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన నడిపించిన తాడేపల్లి పోలీసులు.

0
195

 *గుంటూరు జిల్లా పోలీస్...* *తాడేపల్లి పోలీస్ స్టేషన్...* *ది.25.12.2025* _*//ఆటో డ్రైవర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్... నడిరోడ్డుపై నడిపించిన తాడేపల్లి పోలీసులు,.//*_ 🚩 పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 18(18.12.2025)వ తేదీ రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ థెరిసా కాలనీ సమీపంలోని అరటి తోటలో బ్రహ్మానందపురానికి చెందిన ఆటో డ్రైవర్ ఇల్లచెరువు.వెంకటరావు (32) అనే వ్యక్తిని జన్మదిన వేడుక సందర్భంగా జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో మల్లినేని. సాయి భవాని అలియాస్ సాయి, వేమూరి మహేష్ బాబు అలియాస్ మహి దాడి చేసి సిమెంటు రాళ్లతో మోది హత్య చేయగా, ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, సీఐ వీరేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్ట్ చేసినట్లు నిన్న(24.12.2025) జరిగిన మీడియా సమావేశంలో నార్త్ డిఎస్పీ మురళీ కృష్ణ గారు తెలిపారు. 🫟తదనంతరం తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు గారి పర్యవేక్షణలో ఎస్సై కాజావలి గారి నేతృత్వంలోనీ ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది ఇద్దరు నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ నడిపిస్తూ, సమాజానికి నిందితుల ప్రవర్తన తెలియజేశారు. 🫟 ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నేరస్తులకు గట్టి హెచ్చరికలు చేసే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను రోడ్లపై నడిపిస్తూ ప్రదర్శన చేసినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మండుటెండల్లో కుడా" పచ్చదనం తో మల్లంపేట ‎హాయ్ రైజ్ మెడోస్ "
  ‎ఓ కప్పుడు నగరం శివారు ప్రాంతం,ప్రస్తుతం సిటీ మద్య లో ఉన్నా "హాయ్ రైజ్ మెడోస్...
By Ponnala Srinivasrao 2026-03-03 09:34:45 0 391
Andhra Pradesh
శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు  శ్రీ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-23 12:27:08 0 112
Telangana
Prashanth takes charge as new SHO of Alwal Police Station
'Bharat Aawaz News Channel' congratulates Prashant garu on assuming charge as the new SHO of Alwal.
By Sidhu Maroju 2025-07-05 15:30:24 0 1K
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి
మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30),...
By Pagadala Venkateswar 2026-02-10 04:40:45 0 80
Telangana
"ఆదర్శ్ నగర్ మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ ఆదర్శ్ నగర్‌లోని మైసమ్మ ఆలయంలో భక్తి వాతావరణం నడుమ...
By Sidhu Maroju 2026-04-01 17:18:38 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com