ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో సమగ్ర కుటుంబ సర్వే - ఏపీ ప్రభుత్వం.

0
103

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సంక్షేమ పథకాలు మరియు ప్రజా యోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు,నివాస పరిస్థితిలో ఆదాయం, ఉపాధి,విద్యా ,ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు సర్వే ద్వారా సేకరించిన డేటాను ఆధారంగా చేసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి,ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ వివాహ విభాగాలు అమలు చేస్తున్న ప్రజా సేవల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక,డేటా ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టి భవిష్యత్తులో విధాన నిర్ణయాలను ఈ సమాచారాన్ని కీలకంగా ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 40
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ...
By Mobbu Venkatramana 2026-02-05 14:17:47 0 301
Kerala
Kerala Private Bus Operators to Strike from July 22
Negotiations between Kerala’s private bus operators and the Transport Ministry have...
By Bharat Aawaz 2025-07-17 06:51:41 0 1K
Telangana
మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి,...
By Pinnehasan Odela 2026-01-14 17:58:26 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com