ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన గుంటూరు కలెక్టర్ మరియు ఎస్పీ

0
215

 *ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్.పి* గుంటూరు, డిసెంబరు 24 : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు. వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా అటల్ స్మృతి వనంను ప్రారంభించనున్నారు. స్మృతి వనంలో అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఎ అదనపు కమిషనర్ భరత్ తేజ, అదనపు ఎస్పీలు హనుమంతు, ఏ.టి.వి రవి కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసిల్దార్ హరి బాబు, సి.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వాడకం...
By Sidhu Maroju 2025-06-11 14:25:31 0 1K
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-28 10:22:04 0 109
West Bengal
রাজ্যে তৈরী হচ্ছে অয়েল স্পিল ডিজাস্টার ম্যানেজমেন্ট প্ল্যান
রাজ্য সরকার নদী বা সমুদ্রে #তেলবাহী জাহাজে দুর্ঘটনা ঘটলেও #জলদূষণ রোধ করতে একটি বিশেষ...
By Pooja Patil 2025-09-13 05:52:48 0 190
Andhra Pradesh
Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి...
By Pagadala Venkateswar 2026-02-11 06:09:36 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com