డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

0
122

కర్నూలు : నంద్యాల జిల్లా : డోన్ : ద్రోణాచలం : 

డోన్ పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి తగిన పరిష్కారాలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన  రచ్చబండ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, త్రాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్, సంక్షేమ పథకాలు వంటి అనేక అంశాలపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్నారు.

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పాతపేట ప్రాంతంలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిని రాబోయే వారం పది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే రైల్వే గేట్ల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్‌కు సంబంధించిన ర్యాంప్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు సమానంగా చేపడతామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్...
By Kothuru Murali 2026-02-16 11:19:25 0 18
Telangana
ISRO LVM3 M6 Rocket Set for Launch 2025
ISRO successfully launched the LVM3-M6 rocket CES carrying the BlueBird Block-2 satellite, the...
By Yadamma Raju Gajapaga 2025-12-24 12:14:29 0 273
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 45
Telangana
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
By Pinnehasan Odela 2026-01-14 18:15:27 0 81
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్  గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-16 06:24:57 0 38
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com