లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్

0
256

*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి*

 

*-దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్ర మోహన్*

 

*-నృసింహుని దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏర్పాట్ల పరిశీలన*

 

 

*మంగళగిరి:*

శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్ర మోహన్ సూచించారు. సోమవారం ఆయన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉందన్నారు. ఇదొక దివ్య క్షేత్రం అని వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం లో దర్శించుకుని శంఖు తీర్థం స్వీకరించి తరించాలని భక్తులు కోరుకుంటారన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముక్కోటి ఉత్సవానికి 30 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయన్నారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ... ప్రధానంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని శంఖు తీర్థం స్వీకరించి వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భక్తులకు కన్నుల పండువగా ఉండేవిధంగా స్వామివారి అలంకరణ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ తాగునీరు, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ కమిషనర్ కేబి శ్రీనివాస్, పెదకాకాని దేవస్థాన ఈఓ లీలా కుమార్ లను నియమించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం
మత సామరస్యానికి నిదర్శనమే ఈద్ మీలాబ్ మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య పెద్దపల్లి పట్టణంలోని మూన్...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 09:31:51 0 727
Telangana
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి... కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
By Gangaram Rangagowni 2026-01-24 09:57:13 0 327
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్ర్గం : గుర్తుతెలియని వ్యక్తి మృతి పై అప్డేట్
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి...
By Kothuru Murali 2026-02-19 11:20:45 0 120
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 186
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
*విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు*    ఘాట్ రోడ్డు, మహా...
By Rajini Kumari 2025-12-26 10:07:04 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com