ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు!!!!!!!
Posted 2025-12-21 14:46:57
0
218
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు. సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.1 లక్ష విరాళం అందించిన కందుల సాయిని భువనేశ్వరి గారు అభినందించారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి భువనేశ్వరి గారు థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sivanagendra
#NaraBhuvaneswari
#AndhraPradesh
#Rampachowdavaram
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా :...
మెడికల్ కాలేజీకి డబ్బుల్లేవు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంట
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట...! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు...
కర్నూలు డ్వామా పీడీ బదిలీ !!
కర్నూలు : జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి వెంకట రమణయ్య బదిలీ అయ్యారు...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...