చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు టిడిపి నాయకులు రంగశెట్టి నరేంద్ర

0
307

*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*

 

*టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*

 

*మంగళగిరి:*

 

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర (బాబి) అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన పోలియో బూత్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రంగిశెట్టి నరేంద్ర మాట్లాడుతూ...

ఈ రోజు నుంచి మూడు రోజులపాటు నగరంలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియోరహిత నగరంగా మంగళగిరిని నిలిపేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఎవరైనా చిన్నారులకు వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించకుండా ఉంటే అటువంటి 0-5 సంవత్సరాలలోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయాలన్నారు. అవసరమైతే మొబైల్‌ బూత్ ల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు   4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు...
By Pinnehasan Odela 2026-02-02 14:57:00 0 197
Telangana
రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ...
By Thativar Shivaji 2026-01-26 15:27:51 0 338
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 252
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com