జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|

0
210

హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో.

వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి కబురు.

టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన.

జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. 

శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని అయితే వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు.

 జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు.

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులను, సభ్యులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sidhumaroju   Accreditation cards go

Search
Categories
Read More
Telangana
జర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన...
మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు...
By CM_ Krishna 2026-01-14 17:36:01 0 415
Andhra Pradesh
స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!!
కర్నూలు : డోన్ :  డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర...
By Hari Krishna 2026-01-24 12:55:36 0 522
Andhra Pradesh
మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలు
విశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న...
By Boiena Rajesh 2026-04-29 03:27:23 0 222
Telangana
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...
By Ellandula Sandeep 2026-01-12 17:44:18 0 513
Telangana
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్...
By Ponnala Srinivasrao 2026-07-05 01:12:39 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com