నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం

0
163

*Press Release*

 

*నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం*

 

*శనివారం అనకాపల్లిలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కు హాజరు*

 

*అమరావతి, డిసెంబర్ 18:* రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అవుతారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకుంటారు. శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ లో చోరీకి పాల్పడిన మహిళా నిందితులు అరెస్ట్
పత్రిక ప్రకటన....   విషయం: కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి...
By Rajini Kumari 2026-01-18 14:19:27 0 166
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా...
By Kothuru Murali 2026-03-16 06:53:48 0 119
Andhra Pradesh
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.3.9 కోట్ల...
By Pagadala Venkateswar 2026-01-22 14:37:56 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com