నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం

0
187

*Press Release*

 

*నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం*

 

*శనివారం అనకాపల్లిలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కు హాజరు*

 

*అమరావతి, డిసెంబర్ 18:* రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అవుతారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకుంటారు. శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22)...
By Pagadala Venkateswar 2026-03-02 07:40:46 0 157
Telangana
పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి.
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU...
By Bheeshman King 2025-12-27 12:09:34 0 312
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 87
Andhra Pradesh
డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ
ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం...
By Ratna Sekhar 2026-02-19 19:55:37 0 977
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.
మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-21 03:07:41 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com