రెవెన్యూ రికార్డులు డిజిలైజేషన్లో ఏఐవినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్

0
158

అమరావతి

 

రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్.

 

అనంతపురంలో రెవన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవటం, 22 ఏ లాంటి తీవ్రమైన అంశంగా ఉండేదని చెప్పిన అనంత కలెక్టర్.

 

సర్వేనెంబర్ లైబ్రరీ తయారు చేశామని వివరించిన కలెక్టర్ ఆనంద్.

 

రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని వివరించిన అనంతపురం కలెక్టర్.

 

అనంత జిల్లాలో గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రరీ సిద్దంగా ఉందని వెల్లడి.

 

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...*

 

* అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్ లో ఉంచండి.

 

* భూ రికార్డులకు సంబంధించిన ఆర్కైవ్స్ ను కూడా మేనేజ్ చేస్తున్నారు.. ఇలాంటి వాటికి చెక్ చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు ఉంది.

 

* రికార్డులు ఆన్ లైన్ లైబ్రరీలో ఉంచితే మానిప్యులేషన్ కు అవకాశం ఉండదు.

 

* బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు కోరాం.

 

* 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసిన వాటిని కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు.

 

* అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ తరహాలోనే వినూత్న ఆలోచనలు చేయాలి.

 

* *ఈ ఆరు కాన్సెప్టులూ జిల్లాల్లో గేమ్ ఛేంజర్లు గా మారతాయి.*

 

* *పూర్తిస్థాయిలో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను మరింతగా విస్తృతపరిస్తే ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.*

 

* *ప్రజలకు ఏది కావాలో దాని పైనే కలెక్టర్ల సదస్సులో చర్చ జరుగుతోంది. ఇలాంటి చర్చలు సమావేశాలే కావాల్సింది.*

 

* వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మరింత వినూత్నంగా ఆలోచనలు చేసి మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ తో రావాలి.

 

* క్షేత్రస్థాయి నుంచే ఇన్నోవేషన్స్ రావాలి.

 

* ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనూ వినూత్న మార్పు వచ్చింది.

 

* 10 నిముషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవినీతి లేకుండా పంపిస్తున్నారు ఇది అభినందనీయం.

 

* ఈ తరహాలో పనిచేస్తే దేశం అంతా మన నుంచే నేర్చుకుంటారు.

 

* రెవెన్యూ శాఖను, రిజిస్ట్రేషన్ శాఖను అభినందిస్తున్నాను.

 

* 22ఏ భూముల విషయంలో ఏలూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో చేసిన మోడల్ ను ఇతర ప్రాంతాల్లోనూ చేయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-02-07 11:50:31 0 96
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 78
Andhra Pradesh
Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!
మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:13:52 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com