Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్

0
132

Scroll 

 

విజయవాడ 

 

వైఎస్ షర్మిలా రెడ్డి

APCC చీఫ్ 

 

- MNREGA పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు. 

 

- గోడ్సే వారసులైన మోడీ @narendramodi , మహాత్ముని సందేశాన్ని, ఆదర్శాలని అవమానించిన దేశద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు

 

- నాడు పేదవారికి పనిదినాలు కల్పించి, ఆత్మాభిమానంతో రెండుపూటలా భోజనం వారి కష్టంతో 

 

- వారు సంపాదించుకునే విధంగా కాంగ్రెస్ తీసుకువచ్చిన MNREGA పేరులో మార్పు చేసి బీజేపీ సర్కారు, 

 

- గాంధీగారి ఆదర్శాలను, విలువలను పూర్తిగా కాలరాసింది. 

 

- గోడ్సే వారసులైన, RSS ప్రతినిధులైన వీరు మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాల్ని తీవ్రంగా అవహేళన చేసి దేశద్రోహులనిపించుకున్నారు. 

 

- MNREGA అనేది కేవలం మహాత్ముని పేరుతో కూడుకున్నది కాదు. 

 

- గ్రామ స్వరాజ్, ఆత్మగౌరవం, స్వీయశక్తితో కడుపు నింపుకోవడం, ఇలాంటి విలువలు, ఆదర్శాలు నిండిన ఒక యజ్ఞము. 

 

- దానిని నాశనం చేసి మోడీ సర్కారు చరిత్రహీనంగా మారింది. 

 

- ఇప్పటికే రాజ్యాంగ, ప్రజాస్వామ్య, వ్యక్తిగత హక్కులను కాలరాసి దిగజారిన మోడీ సర్కారు ఇంకెంత దిగజారుతుందో.

 

- నాడు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్ సాకారం కావాలనే సదుద్దేశంతో MNREGA అందుబాటులోకి వచ్చింది. 

 

- గ్రామాల స్వయం సమృద్ధి, పాలన వికేంద్రీకరణ, స్వావలంబన, అతి ముఖ్యంగా స్వాభిమానం. 

 

- నేడు ఇవన్నీ గ్రామాలనుండి గుంజుకుని, గ్రామాల్లో ప్రజలు తమకాళ్ళపై తాము నిలవనీకుండా చేసే కుట్రలో భాగమే ఈ పథకంపై బీజేపీ దాడి. 

 

- అన్నీ తమ అధీనంలో ఉంచుకుని గ్రామాలను కట్టుబానిసలుగా చేసి, మరల వలసలు ప్రోత్సహించే మూర్ఖత్వమే.

 

- నాడు వైఎస్సార్ పాలనలో MNREGA లో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. 

 

- నేడు మోడీ చెంచా పార్టీల్లా మారిన టీడీపీ, జనసేన, వైసీపీ, ఇంత దారుణం జరుగుతున్నా నోరు మెదపలేకపోవటం వారి రాజకీయ విలువల పతనానికి అద్దం పడుతోంది. 

 

- ఇంత ఘనమైన పధకాన్ని నాడు మన తెలుగు నేలపై ప్రారంభించడంలోనే అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ తపన పడిన జీవనోపాధి, భద్రత, ఏ బీదవాడు ఆకలితో ఉండకూడదు అనే విషయాలు దాగివున్నాయి, 

 

- మరి నేడు వాటిని కూలదోసి, మరలా గోడ్సే రాజ్యాన్ని, RSS రాజ్యాంగాన్ని నెలకొల్పాలనే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.

 

- కాంగ్రెస్ @INCIndia ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోదు, 

 

- అడుగడుగు, బీజేపీ మార్కు ఫాసిజంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. 

 

- ఖచ్చితంగా ప్రజల గొంతుకుగా మారి, వారి చేతిలో ఆయుధమై బీజేపీ సర్కారును చీల్చి పాతాళంలో తొక్కేస్తుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా...
By Pagadala Venkateswar 2026-02-14 06:41:12 0 92
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరులో క్రాకర్స్ విక్రయాలకు అనుమతులు లేవు
పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు....
By Kothuru Murali 2026-03-02 04:11:22 0 80
Goa
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
By Bharat Aawaz 2025-07-17 06:22:44 0 975
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com