Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్

0
156

Scroll 

 

విజయవాడ 

 

వైఎస్ షర్మిలా రెడ్డి

APCC చీఫ్ 

 

- MNREGA పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు. 

 

- గోడ్సే వారసులైన మోడీ @narendramodi , మహాత్ముని సందేశాన్ని, ఆదర్శాలని అవమానించిన దేశద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు

 

- నాడు పేదవారికి పనిదినాలు కల్పించి, ఆత్మాభిమానంతో రెండుపూటలా భోజనం వారి కష్టంతో 

 

- వారు సంపాదించుకునే విధంగా కాంగ్రెస్ తీసుకువచ్చిన MNREGA పేరులో మార్పు చేసి బీజేపీ సర్కారు, 

 

- గాంధీగారి ఆదర్శాలను, విలువలను పూర్తిగా కాలరాసింది. 

 

- గోడ్సే వారసులైన, RSS ప్రతినిధులైన వీరు మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాల్ని తీవ్రంగా అవహేళన చేసి దేశద్రోహులనిపించుకున్నారు. 

 

- MNREGA అనేది కేవలం మహాత్ముని పేరుతో కూడుకున్నది కాదు. 

 

- గ్రామ స్వరాజ్, ఆత్మగౌరవం, స్వీయశక్తితో కడుపు నింపుకోవడం, ఇలాంటి విలువలు, ఆదర్శాలు నిండిన ఒక యజ్ఞము. 

 

- దానిని నాశనం చేసి మోడీ సర్కారు చరిత్రహీనంగా మారింది. 

 

- ఇప్పటికే రాజ్యాంగ, ప్రజాస్వామ్య, వ్యక్తిగత హక్కులను కాలరాసి దిగజారిన మోడీ సర్కారు ఇంకెంత దిగజారుతుందో.

 

- నాడు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్ సాకారం కావాలనే సదుద్దేశంతో MNREGA అందుబాటులోకి వచ్చింది. 

 

- గ్రామాల స్వయం సమృద్ధి, పాలన వికేంద్రీకరణ, స్వావలంబన, అతి ముఖ్యంగా స్వాభిమానం. 

 

- నేడు ఇవన్నీ గ్రామాలనుండి గుంజుకుని, గ్రామాల్లో ప్రజలు తమకాళ్ళపై తాము నిలవనీకుండా చేసే కుట్రలో భాగమే ఈ పథకంపై బీజేపీ దాడి. 

 

- అన్నీ తమ అధీనంలో ఉంచుకుని గ్రామాలను కట్టుబానిసలుగా చేసి, మరల వలసలు ప్రోత్సహించే మూర్ఖత్వమే.

 

- నాడు వైఎస్సార్ పాలనలో MNREGA లో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. 

 

- నేడు మోడీ చెంచా పార్టీల్లా మారిన టీడీపీ, జనసేన, వైసీపీ, ఇంత దారుణం జరుగుతున్నా నోరు మెదపలేకపోవటం వారి రాజకీయ విలువల పతనానికి అద్దం పడుతోంది. 

 

- ఇంత ఘనమైన పధకాన్ని నాడు మన తెలుగు నేలపై ప్రారంభించడంలోనే అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ తపన పడిన జీవనోపాధి, భద్రత, ఏ బీదవాడు ఆకలితో ఉండకూడదు అనే విషయాలు దాగివున్నాయి, 

 

- మరి నేడు వాటిని కూలదోసి, మరలా గోడ్సే రాజ్యాన్ని, RSS రాజ్యాంగాన్ని నెలకొల్పాలనే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.

 

- కాంగ్రెస్ @INCIndia ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోదు, 

 

- అడుగడుగు, బీజేపీ మార్కు ఫాసిజంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. 

 

- ఖచ్చితంగా ప్రజల గొంతుకుగా మారి, వారి చేతిలో ఆయుధమై బీజేపీ సర్కారును చీల్చి పాతాళంలో తొక్కేస్తుంది.

Search
Categories
Read More
Telangana
గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"
ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా...
By Ponnala Srinivasrao 2026-04-12 01:10:07 0 108
Telangana
తెలంగాణా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ
కవిత కొత్త పార్టీ పేరు ఇదే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు మేడ్చల్ సభలో తన...
By MERIGE MALLESH 2026-04-25 07:27:56 0 115
Andhra Pradesh
పిజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-20 06:15:49 0 132
Andhra Pradesh
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు...
By Benguluri Madhubabu 2026-03-20 11:36:02 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com