"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"

0
114

సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ పోలీసులు రట్టు చేశారు. 

ఎలాంటి కనీస అర్హత లేకుండా క్లినిక్ నడుపుతూ, రోగులకు ఇష్టమొచ్చినట్లు ఇంజక్షన్లు ఇస్తున్న నిందితుడిని వారాసిగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన నన్నుట మాధవ్ (42) అనే వ్యక్తి వారాసిగూడలో "మాధవ మెడికల్ షాప్" పేరుతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఇతనికి వైద్య రంగంలో ఎలాంటి అనుభవం కానీ, ఫార్మసీ అర్హతలు కానీ లేవు. కేవలం సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో, కుంట అర్చన అనే స్నేహితురాలి డ్రగ్ లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని ఇతను ఇక్కడ చట్టవిరుద్ధంగా డాక్టర్ అవతారమెత్తాడు.

గత ఏడాది కాలంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వచ్చే రోగులందరికీ డిక్లోఫెనాక్ (Diclofenac), టిటి (TT) వంటి ఇంజక్షన్లు ఇస్తూ ప్రాక్టీస్ సాగిస్తున్నాడు. 

దీనిపై ఖచ్చితమైన సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు పక్కా వ్యూహంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.

సాధారణ దుస్తుల్లో వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్‌కు నిందితుడు ఇంజక్షన్ ఇవ్వబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నిందితుడి నుంచి భారీగా ఇంజక్షన్ వైల్స్‌తో పాటు వ్యాపారానికి వాడుతున్న శామ్‌సంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అర్హత లేకుండా నకిలీ వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

ప్రజలు కూడా తమ ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, కేవలం గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లను మాత్రమే సంప్రదించాలని వారాసిగూడ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-02-28 07:15:36 0 96
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
By Kothuru Murali 2026-02-23 12:26:19 0 246
Andhra Pradesh
జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.
జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న...
By Pagadala Venkateswar 2026-04-14 06:20:23 0 97
Andhra Pradesh
పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ నందు వైద్యం వికటించి బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ బాలింత మృతి పై ఆందోళనకు దిగిన...
By mahaboob basha 2025-12-05 15:24:29 0 526
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com