మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|

0
181

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి  షఫీఉల్లా (IFS) గారిని మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల ప్రజలకు స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే  వినతి పత్రాన్ని సమర్పించారు.

 నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, స్మశాన వాటిక కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడం అత్యవసరమని ఆయన వివరించారు.

దీనిపై కార్యదర్శి శ్రీ షఫీఉల్లా  సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశం ద్వారా మైనార్టీ వర్గాల మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ముందడుగు పడిందని ఎమ్మెల్యే  తెలిపారు.

Sidhumaroju   

Search
Categories
Read More
Telangana
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు...
By Ellandula Sandeep 2026-02-25 15:04:24 0 158
Andhra Pradesh
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
By Hari Krishna 2025-12-14 14:03:45 0 217
Andhra Pradesh
పుంగనూరు: ప్రారంభమైన మసెమ్మ జాతర
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. సుమారు...
By Kothuru Murali 2026-02-01 05:39:26 0 126
Andhra Pradesh
రోడ్డు మీద నే వాటర్ ట్యాంక్ వాహనం బోల్తా
విశాఖ లో గల  కలెక్టర్  ఆఫీస్  నాలుగు రోడ్డు కూడలి లో కాంప్లెక్స్ నుండి బీచ్ వైపు...
By Mobbu Venkatramana 2026-02-20 14:03:04 0 177
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com