25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి

0
161

25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-

ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర చరిత్రలోనే మైలురాయి-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్-

 

విజయవాడ- 16 డిసెంబర్ 2025-

 

ఖరిఫ్ 2025–26 సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 16 డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,96,854 మంది రైతుల నుండి రూ.5,938.20 కోట్ల విలువ గల 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గ మైలురాయిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

 

ఇప్పటివరకు 3,79,538 మంది రైతులకు రూ.5,682.77 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన రూ.255.43 కోట్ల రూపాయలు తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్‌లో రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయని తెలిపారు.

 

రైతులకు మద్దతు ధర (MSP) అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

 

రైతులు తమ ధాన్యం విక్రయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం: 1967 ను సంప్రదించవచ్చని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు 24 గంటల లోపు మద్దతు ధర (MSP) పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 3,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధరకన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!  ...
By Ellandula Sandeep 2025-12-24 11:18:31 0 404
Andhra Pradesh
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
By Kola Kirankumar 2026-03-31 18:28:44 0 103
Andhra Pradesh
శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు...
By Benguluri Madhubabu 2026-03-14 13:39:06 0 125
Telangana
సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం
సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకా బారత్ ఆవాజ్  తెలంగాణ కోడంగల్   ...
By Vanmoj Suryamohan 2025-12-22 13:16:17 0 283
Telangana
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్...
By Ponnala Srinivasrao 2026-03-24 00:53:39 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com