25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి

0
218

25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-

ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర చరిత్రలోనే మైలురాయి-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్-

 

విజయవాడ- 16 డిసెంబర్ 2025-

 

ఖరిఫ్ 2025–26 సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 16 డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,96,854 మంది రైతుల నుండి రూ.5,938.20 కోట్ల విలువ గల 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గ మైలురాయిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

 

ఇప్పటివరకు 3,79,538 మంది రైతులకు రూ.5,682.77 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన రూ.255.43 కోట్ల రూపాయలు తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్‌లో రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయని తెలిపారు.

 

రైతులకు మద్దతు ధర (MSP) అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

 

రైతులు తమ ధాన్యం విక్రయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం: 1967 ను సంప్రదించవచ్చని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు 24 గంటల లోపు మద్దతు ధర (MSP) పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 3,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధరకన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Haryana
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 05:19:26 0 29
Business & Finance
June GST Growth Boosts Himachal Development Outlook
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 06:48:29 0 58
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 58
Andhra Pradesh
గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*
చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో...
By Vadlamudi NagaVenkat 2026-04-17 05:23:39 0 218
Business & Finance
Wind Up Your Company with Legal Compliance and Ease
Winding up a company is the legal process of closing its operations, settling outstanding...
By Navya Sree 2026-07-23 05:30:09 0 15
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com