నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|

0
246

సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

బోయిన్ పల్లి కి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్య లు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. 

మరొక కేసులో మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన సింధు అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ బంగారు ఆభరణాలను అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

బొల్లారంలో నివాసం ఉంటే సుజాత అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారు, వంద తులాల వెండి ఆభరణాలు అల్మారాలో కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పనిమనిషిగా ఉన్న సింధును విచారించగా దొంగతనం చేసినట్లు వెళ్లడైంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇలాంటి దొంగతనాలను అరికట్టాలంటే ఇళ్లలో పని మనుషులను చేర్చుకునే ముందు వారి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా విలువైన వస్తువులను తరచు తనిఖీ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

Sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 445
Telangana
బీజేపీలో చేరనున్న తెలంగాణ లోని కీలక నేత కుటుంబం.!
ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి...
By Ponnala Srinivasrao 2026-05-06 05:11:10 0 143
Andhra Pradesh
మదనపల్లి: తాసిల్దార్ పై అవినీతి ఆరోపణలు
మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-04-06 04:14:18 0 162
Telangana
గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్" హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం...
By Sidhu Maroju 2026-07-02 08:13:50 0 73
Telangana
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని పోలీస్ స్టేషన్ ను మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్...
By CH. Pradeep 2026-04-17 14:10:11 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com