నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|

0
245

సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

బోయిన్ పల్లి కి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్య లు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. 

మరొక కేసులో మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన సింధు అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ బంగారు ఆభరణాలను అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

బొల్లారంలో నివాసం ఉంటే సుజాత అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారు, వంద తులాల వెండి ఆభరణాలు అల్మారాలో కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పనిమనిషిగా ఉన్న సింధును విచారించగా దొంగతనం చేసినట్లు వెళ్లడైంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇలాంటి దొంగతనాలను అరికట్టాలంటే ఇళ్లలో పని మనుషులను చేర్చుకునే ముందు వారి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా విలువైన వస్తువులను తరచు తనిఖీ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

Sidhumaroju.

Search
Categories
Read More
Health & Fitness
Smart E-Bike Tech Wins Digital Prize at Eurobike 2026
Avinox has secured the prestigious 2026 Eurobike Award in the Digital Solutions category for its...
By Lokeshwari Panthadi 2026-06-27 04:56:23 0 53
SURAKSHA
స్పందన కార్యక్రమం - ప్రజా సమస్యల పరిష్కారం
ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే 'స్పందన' కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను...
By Kalaga Sailaja 2026-06-29 07:31:21 0 37
Andhra Pradesh
ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి...
By Boiena Rajesh 2026-04-10 01:04:49 0 154
Punjab
Government Launches Landmark Menstrual Health Drive in State Schools
The Punjab Government has initiated a pioneering, large-scale menstrual health education drive...
By Tejaswini Komanduru 2026-06-05 07:03:56 0 356
Andhra Pradesh
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి....
By Boiena Rajesh 2026-03-31 09:13:35 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com