గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|

0
70

"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్"

హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రులు, రాజ్యసభ సభ్యుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. 

ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందిస్తామని, ప్రజాపాలనలో సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 192
Andhra Pradesh
తృటిలో తప్పిన ప్రమాదం.
మదనపల్లెలో సబ్ కలెక్టరేట్, ఉడా కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఒక చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ, ఆ...
By Pagadala Venkateswar 2026-03-12 14:27:21 0 181
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Telangana
MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం...
By Bheeshman King 2026-07-22 12:54:06 0 139
Andaman & Nikobar Islands
India Approves ₹13K-Cr Dual-Use Military Airport
The Ministry of Defence has greenlit a monumental ₹13,000 crore dual-use Greenfield International...
By Lokeshwari Panthadi 2026-06-30 08:24:53 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com