వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

0
397

 

*వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్*

మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల ముసుగులో బలవంతపు వసూళ్లు చేస్తున్న ఓ యూట్యూబ్ డిజిటల్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తొర్రూరు ఎస్సై ఉపేందర్ తెలిపారు. గురువారం అరెస్టు చేసిన సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 4.30 గంటలకి ములుగు నివాసి ధరావత్ ఆనంద్ పోచంపల్లి గ్రామం పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పాలకేంద్రం దగ్గర ఆగి అక్కడి వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కొని తన కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించి, దారి మధ్యలో అడ్డగించి వారిని మేము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులమని,కారును చెక్ చేసి, కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని రూ.1లక్ష రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారని, ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ మరియు డ్రైవర్ కుమార్ ను అతని కారును బంధించగా ఇతను బెదిరిపోయి వాళ్ల బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ఒక లక్ష రూపాయలను సర్దుబాటు చేసి, వీరికి ఇచ్చి కారును అతని డ్రైవర్ ను విడిపించుకున్నారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులలో ఒకతను సివిల్ డ్రెస్ లో ఉండగా మిగతా ఇద్దరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి అతన్ని వాళ్ళ ఇంటి వద్ద పట్టుకుని అరెస్టు చేసి, అతని వద్దనుండి నేరానికి వాడిన కారు, బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న రూపాయలు 50,000 అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.మిగతా ఇద్దరి నేరస్తుల్లో ఒకరు ఒక ప్రముఖ వార్త పత్రికలో తొర్రూరు విలేకరిగా, మరొకరు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారని, వారిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
By John Baji 2026-02-11 05:54:56 0 457
Andhra Pradesh
నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!
నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో ...
By Chennaiah Kati 2026-02-11 11:35:08 0 283
Telangana
కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?"  అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు ‎
కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?  ‎ ‎ప్రభుత్వంతో సమాంతరంగా పని...
By Ponnala Srinivasrao 2026-04-14 05:11:36 0 153
Andhra Pradesh
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-29 07:34:37 0 150
Manipur
Inquiry Commission Granted Fifth Extension
The Union Home Ministry has extended the tenure of the Manipur Commission of Inquiry by another...
By Dunna Jessicaruth 2026-05-15 10:18:05 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com