వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

0
353

 

*వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్*

మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల ముసుగులో బలవంతపు వసూళ్లు చేస్తున్న ఓ యూట్యూబ్ డిజిటల్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తొర్రూరు ఎస్సై ఉపేందర్ తెలిపారు. గురువారం అరెస్టు చేసిన సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 4.30 గంటలకి ములుగు నివాసి ధరావత్ ఆనంద్ పోచంపల్లి గ్రామం పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పాలకేంద్రం దగ్గర ఆగి అక్కడి వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కొని తన కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించి, దారి మధ్యలో అడ్డగించి వారిని మేము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులమని,కారును చెక్ చేసి, కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని రూ.1లక్ష రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారని, ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ మరియు డ్రైవర్ కుమార్ ను అతని కారును బంధించగా ఇతను బెదిరిపోయి వాళ్ల బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ఒక లక్ష రూపాయలను సర్దుబాటు చేసి, వీరికి ఇచ్చి కారును అతని డ్రైవర్ ను విడిపించుకున్నారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులలో ఒకతను సివిల్ డ్రెస్ లో ఉండగా మిగతా ఇద్దరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి అతన్ని వాళ్ళ ఇంటి వద్ద పట్టుకుని అరెస్టు చేసి, అతని వద్దనుండి నేరానికి వాడిన కారు, బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న రూపాయలు 50,000 అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.మిగతా ఇద్దరి నేరస్తుల్లో ఒకరు ఒక ప్రముఖ వార్త పత్రికలో తొర్రూరు విలేకరిగా, మరొకరు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారని, వారిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుడివాడలో ప్రజా దర్బార్ ను నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*రాజకీయాలు పక్కనపెట్టి... అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 14:01:46 0 147
Andhra Pradesh
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ...
By Benguluri Madhubabu 2026-02-13 06:39:06 0 234
Telangana
'కాళేశ్వరం' పై ఎలాంటి దురీదేశమూ లేదు:మంత్రి
TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని...
By MERIGE MALLESH 2026-04-17 09:44:41 0 136
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-09 07:30:32 0 125
Andhra Pradesh
Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్
Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో...
By Siva Bhaskar 2026-02-02 04:49:42 0 367
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com