డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల (2BHK) ప్రాజెక్టులకు ఇసుక రవాణా చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తి

0
113

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో కెసిఆర్ గారి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం ఔరా అనిపిస్తోంది. 145 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 117 బ్లాకుల్లో ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం ఇది. ఇందులో ఏకంగా 15,660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు.  అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌  (జూన్ 22) వీటిని ప్రారంభిం చి. లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను అందజేశారు. 

‎డబుల్ బెడ్రూం ఇళ్లు..117 బ్లాకుల్లో 15,660 ఫ్లాట్లు

‎ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు. జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల్లో భారీ స్థాయిలో వీటిని నిర్మించారు. 

‎పెద్దలు కెసిఆర్ గారు మంచి ఉద్దేశం తో స్టార్ట్ చేసిన ,ఈ డబుల్ బెడ్రూం ప్రాజెక్ట్ కోసం స్పెషల్గా tsmdc లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక వాడుకునేడుకు సదరు కాంట్రాక్టర్ కి పర్మిషన్ ఇచ్చింది,ప్రాజెక్ట్ కోసం సదరు కాంట్రాక్టర్ ,ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయ్యెవరకు నది నుండి ప్రాజెక్ట్ కి లారీల ద్వారా రవాణా చేసెందుకు ఓ ప్రైవేట్ వ్యక్తితో వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంధి,ఒకటో రెండో లారీలు ఉన్నా వ్యక్తి కి,ఈ భారీ ప్రాజెక్ట్ ఇవ్వడం వెనుక ఏమిమథలాబ్ ఉందొ అని అప్పట్లోనే పదుల సంఖ్య లో ఉన్నా,లారీ యజమానులు గుసగుసలాడారని సమాచారం,ఈ ప్రాజెక్ట్ కోసం రోజు వందల సంఖ్య లో లారీలు హైదరాబాదు వైపు వచ్చేవని,సిటీ ఏరియా కి రాగనే కొన్ని లారీలు ప్రైవేట్ బిల్డర్స్ కి వెళ్ళేవని కొందరు డ్రైవర్లు చెప్పేవారని సమాచరం,ఇలా ప్రాజెక్ట్ ప్రారంభం ఐనా 2 సంవత్సరాలు లో నే ఆ ఇసుక రవాణా చేసే వ్యక్తి కాంట్రాక్టర్ తో కుమ్మకై ,కోట్లా రూపాయలు అక్రమంగాసంపాదించడం పైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లపై,ఇసుక రవాణా చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరపాలని, అవినీతిని అధికారులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తి

Search
Categories
Read More
Andhra Pradesh
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
By Mobbu Venkatramana 2026-02-23 15:04:22 0 208
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు...
By Hari Krishna 2025-12-15 11:41:52 0 212
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
By Kothuru Murali 2026-04-05 07:46:31 0 54
Andhra Pradesh
తిరుమలకు క్యూ కట్టిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీనీ రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో...
By Karapati Gopi 2025-12-30 02:15:31 0 228
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com