విద్యార్థుల కలలకు రెక్కలు

0
197

కలలకు రెక్కలు:

నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం

విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల సౌమ్య – బడుగు విద్యార్థుల కల నెరవేర్చిన ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం

 

నందిగామ, మే 5: భారత్అవాజ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే శ తంగిరాల సౌమ్య  ఆధ్వర్యంలో ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం కింద పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరు మంది విద్యార్థులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కలలు సాకారం చేసే దిశగా ఒక మంచి అడుగు అని అందరూ ప్రశంసించారు.

విమాన ప్రయాణంలో పాల్గొన్న విద్యార్థులు

షేక్ అర్షియా నాజ్ – కంచికచర్ల మండలం మొగులూరు జిల్లా పరిషత్ హైస్కూల్, 589 మార్కులు.

ప్రజాపతి పర్వీన్ – నందిగామ మండలం లింగాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, 576 మార్కులు.

వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు – జిల్లా పరిషత్ హైస్కూల్, 571 మార్కులు.

పల్లె పోగు వినీల – చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం గురుకుల పాఠశాల, 567 మార్కులు.

నారిశెట్టి జగదీష్ ఆదిత్య – చందర్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, 559 మార్కులు.

ఉప్పులూరి సోనీ ప్రియా – నందిగామ పట్టణం అనాసాగరం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్, 549 మార్కులు.

ఈ విద్యార్థులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న సామాన్యులు. సాధారణంగా బస్సు, కారు లేదా రైలు ప్రయాణాలకు మాత్రమే అలవాటు పడిన వీరికి విమాన ప్రయాణం ఒక కల. ఆ కలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా నెరవేర్చారు. విద్యలో పెను మార్పులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విద్యా రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు ఫలితాలను ఇస్తున్నాయని ఎమ్మెల్యే సౌమ్య గారు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు 81.14 శాతం ఉండగా, ఈ సంవత్సరం 85.25 శాతానికి చేరాయి. నందిగామ నియోజకవర్గంలోనూ గత సంవత్సరం 74.80 శాతం నుంచి ఈ సంవత్సరం 80.08 శాతానికి పెరిగింది. విద్యా మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ఉపాధ్యాయులకు సింగపూర్ విదేశీ పర్యటనలు, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆమె అన్నారు.

గురువులు, తల్లిదండ్రుల స్ఫూర్తి

విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కీలకమని ఎమ్మెల్యే సౌమ్య గారు పేర్కొన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కలలు సాకారం చేసుకునే స్ఫూర్తిని నింపుతుందని అందరూ ఆశా భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు,విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నేతలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
APSRTCలో మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
APSRTCలో మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ అమరావతి : మెడికల్...
By Gadiyapudi Narendra 2025-12-27 10:53:54 0 239
Andhra Pradesh
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగాCM చంద్రబాబు నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 22.12.2025*   స్థానిక మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ లో ఏపీ...
By Rajini Kumari 2025-12-23 07:46:53 0 159
Andhra Pradesh
మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.
మదనపల్లె మాజీ కౌన్సిలర్ సిద్ధమ్మ, సత్యనారాయణ, రేవతి శుక్రవారం తమకు ఎదురవుతున్న ముప్పు గురించి...
By Pagadala Venkateswar 2026-03-13 14:08:57 0 125
Andhra Pradesh
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
By Rajini Kumari 2025-12-27 11:06:49 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com