అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే

0
287

*తెలుగు రాష్ట్రాల 

అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*

 

 

 

అమరావతి

******

 

 

 

రాష్ట్ర విభజన చట్టం(2014)లోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి.. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 225కి పెంచుకునే వెసులుబాటు

 

 

జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదిత

 

కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటన

 

 

 

జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియకు రూ.11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభ మై తుది నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. దీంతో, 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఇంకో ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్‌ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు. ఆ తర్వాత పునర్విభజన చేపడితే.. 2034 ఎన్నికలకు కొత్త నియోజవకర్గాలు అందుబాటులోకి రానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 04:44:03 0 143
Lakshdweep
The Agatti Expansion: Development vs. Tradition
Current debates in Kavaratti and Agatti have intensified regarding the massive land acquisition...
By Dunna Jessicaruth 2026-05-14 10:54:59 0 165
Andhra Pradesh
మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు....
By Pagadala Venkateswar 2026-02-24 08:01:37 0 167
Andhra Pradesh
పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్
పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ,...
By Kothuru Murali 2026-01-11 13:09:09 0 171
Telangana
1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు...
By Chunarkar Jagadeesh 2026-07-04 09:01:19 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com