లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|

0
151

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు. ఆయన స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ముఖ్యమంత్రి సహాయనిధి (ఎంఆర్ఎఫ్) ని మంజూరు చేయించి శుక్రవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లంపేట్ వాసులు కృష్ణ చారి రూ. 60000/-,129 డివిజన్ షాపూర్ నగర్ వాసులు హన్మంత్ రావు 52,500/-, డి. పోచంపల్లి వాసులు అబ్దుల్ ఖాదర్ రూ 31500/-, నిజాంపేట్ వాసులు పి,కీర్తి 20000/-, 132 డివిజన్ జీడిమెట్ల వాసులు సి ఎచ్ సంతోష్ కుమార్ 26000/-, ప్రగతినగర్ వాసులు సీత రత్నం 60000/- లేకు సీఎంఆర్ఎఫ్-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. 

అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోలా సంజీవ్ రెడ్డి, పండరి రావు, గణేష్, బాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం
  బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం...
By Gadiyapudi Narendra 2026-02-24 17:02:29 0 130
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 124
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Andhra Pradesh
Nandhyal district drone
నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన....
By G k Nookala 2026-03-09 08:06:15 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com