లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|

0
47

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు. ఆయన స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ముఖ్యమంత్రి సహాయనిధి (ఎంఆర్ఎఫ్) ని మంజూరు చేయించి శుక్రవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లంపేట్ వాసులు కృష్ణ చారి రూ. 60000/-,129 డివిజన్ షాపూర్ నగర్ వాసులు హన్మంత్ రావు 52,500/-, డి. పోచంపల్లి వాసులు అబ్దుల్ ఖాదర్ రూ 31500/-, నిజాంపేట్ వాసులు పి,కీర్తి 20000/-, 132 డివిజన్ జీడిమెట్ల వాసులు సి ఎచ్ సంతోష్ కుమార్ 26000/-, ప్రగతినగర్ వాసులు సీత రత్నం 60000/- లేకు సీఎంఆర్ఎఫ్-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. 

అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోలా సంజీవ్ రెడ్డి, పండరి రావు, గణేష్, బాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను...
By Sidhu Maroju 2025-08-29 15:00:31 1 362
Telangana
దంచి కొడుతున్న వర్షం
హైదరాబాద్: వారాసిగూడ శ్రీదేవి నర్సింగ్ హోమ్ ,గుడ్ విల్ కేఫ్ దగ్గర చెరువును తలిపిస్తున్న...
By Sidhu Maroju 2025-09-17 17:30:35 0 144
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com