బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
198

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ పరిశీలనకు వెళ్లి మార్కెట్ మొత్తం కలియతిరిగి రైతులు, వ్యాపారులు,హమాలీలతో  మాట్లాడారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు,వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మరియు మౌలిక వసతులైన ఉపయోగం లేని టాయిలెట్లను తొలగించి నూతనంగా నిర్మించాలని, మార్కెట్లో రహదారులు పాడై పోయినందున రహదారులను అభివృద్ధి చేయాలని, మార్కెట్ ను ప్రతిరోజు క్లీనింగ్ చేపించాలని, ఓపెన్ డ్రైనేజీని శుభ్రం చేసి దోమల బారి నుంచి కాపాడాలని కోరారు.

 వ్యాపారులు కూడా లైసెన్సుల విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మన్, సెక్రటరీ ,కమిటీ సభ్యులు, కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమై మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై చర్చించి రాష్ట్రంలోనే అతి పెద్దదైన బోయిన్ పల్లి మార్కెట్ లో మెరుగైన మౌలిక వసతులను కల్పిద్దామని, మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్కెట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చిందని కావున మార్కెట్ సమస్యలను అవసరమైతే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళదామని, మార్కెట్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. మార్కెట్ పరిశీలనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
AP TET-2025: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. తన...
By Pagadala Venkateswar 2026-01-09 14:49:33 0 207
Andhra Pradesh
ప్లాస్టిక్ నిషేదించాలి పకృతిని కాపాడాలి - చీరాల ఎమ్మెల్యే కొండయ్య
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర విజన్...
By Vadlamudi NagaVenkat 2026-04-18 07:22:52 0 219
Andhra Pradesh
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-03-13 07:11:07 0 193
Andhra Pradesh
జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు
*జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా...
By Rajini Kumari 2026-03-14 12:16:24 0 218
Telangana
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం...
By Sidhu Maroju 2025-10-07 11:30:02 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com