జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు

0
171

*జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సేవా కార్యక్రమాలు.*

 

*జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉదయభాను గారు.*

 

 

 

_జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో రక్తదానం, అన్నదానం మరియు పండ్లను మరియు మొక్కల పంపిణీ వంటి సేవ కార్యక్రమాలను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు ప్రారంభించారు._

 

_ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో జనసైనికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారని తెలియజేశారు అలాగే ఆకలి లేని సమాజం కోసం పేదలకు, బాటసారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అని తెలియజేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురికి మొక్కలను, ఆరోగ్యకరమైన పండ్లను పంపిణీ చేసామని అన్నారు._

_"సమాజ మార్పు కోసం, ప్రజల గొంతుకగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నేడు 13వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణం అని రాజకీయాల్లో జవాబుదారీతనం, సామాజిక బాధ్యతను పెంచడమే జనసేన లక్ష్యం అని, ఈ ఆవిర్భావ దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదు అని._ _ఇది ప్రజలకు సేవ చేసే ప్రతిజ్ఞ అని ఆయన తెలిపారు. ఈ రక్తదానం చేసిన ప్రతి జనసైనికుడికి, వీర మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు._ _అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా నాయకులకు, కార్యకర్తలకు ఉదయభాను గారు ధన్యవాదాలు తెలియజేశారు.._

 

 _ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మరియు NTR జిల్లా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, విద్యార్థులు పాల్గొన్నారు._

Search
Categories
Read More
Andhra Pradesh
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-17 06:17:18 0 295
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద...
By Kothuru Murali 2026-04-11 06:30:58 0 72
Andhra Pradesh
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు    - నిమిషాల్లో పని పూర్తి...
By Rajini Kumari 2025-12-17 09:12:58 0 184
Andhra Pradesh
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
By Pagadala Venkateswar 2026-04-10 05:45:06 0 70
Telangana
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-04-13 22:09:44 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com