హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|

0
154

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక అభివృద్ధికి రూ.1 కోటి 90 లక్షలు మంజూరు చేయించడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మరియూ స్థానిక కార్పొరేటర్ లను హిందూ స్మశాన వాటిక కమిటీ ఘనంగా సన్మానించింది. 

 

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ..

 

స్మశానవాటిక అభివృద్ధికి కావాల్సిన నిధులు పొందేందుకు పైస్థాయి అధికారులను నిరంతరం అనుసంధానం చేస్తూ అనుమతులు పొందగలిగామని స్మశానవాటికను మోడల్ గ్రేవియర్డ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అయన తెలిపారు.

 

ప్రజల సమస్యలను మాటల్లో కాదు… చేతల్లో చూపడమే తమ పని తీరు అని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన వివరించారు.

 

ఈ కార్యక్రమంలో హిందూ స్మశానవాటిక కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా గౌడ్, సూర్య కిరణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

 

Sidhumaroju

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు జిల్లా కురవ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన కర్నూలు ఎంపీ !!
కర్నూలు : కర్నూలు నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి...
By Hari Krishna 2025-12-29 10:52:45 0 174
Andhra Pradesh
మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన...
By Ratna Sekhar 2026-03-11 07:07:27 0 107
Andhra Pradesh
బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
    బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద...
By Gadiyapudi Narendra 2026-02-17 16:16:55 0 124
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా...
By Pagadala Venkateswar 2026-03-18 06:26:18 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com