ఆ స్నేహితులు మద్యానికి బానిసలు, ముఠాగా ఏర్పడి దారిదోపిడిలు- అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
218

సికింద్రాబాద్ : మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడిలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఉత్తర మండల పరిధిలోని బేగంపేట,మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కత్తులతో బెదిరించి అమాయకుల నుండి దారిదోపిడిలకు పాల్పడుతున్న ఐదు మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు. నిందితుల నుండి రెండు కత్తులు, రెండు సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కేసులలో కార్ఖానా కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ప్రధాన సూత్రధారిగా జేబీఎస్ ,మడ్ ఫోర్డ్ ప్రాంతాలకు చెందిన నరసింహ, కార్తీక్, పరశురాం, శివ లు నేరానికి సహకరించినట్లు డిసిపి తెలిపారు. వీరంతా మధ్యానికి బానిసలుగా మారి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు ఒడిగట్టినట్లు స్పష్టం చేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి విధులు ఊహించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో జేబీఎస్ వద్ద అతనిని అడ్డగించి కత్తులతో బెదిరించి 18 వేల రూపాయలను లాక్కొని పరారైనట్లు తెలిపారు. మరొక ఘటనలో పరేడ్ మైదానం వద్ద తన స్నేహితుని ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న అన్సారి అనే వ్యక్తిపై ఆటోలో వచ్చిన దుండగులు కత్తి తో దాడికి పాల్పడి అతని వద్ద ఉన్న ఆరువేల రూపాయలను అపహరించుకొని ఆటోలో పరారయ్యారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ దారిదోపిడీలు ఒకే ముఠా చేసిన పనిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన...
By Pagadala Venkateswar 2026-04-06 04:22:54 0 134
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి రెండేళ్లు కావస్తున్న మహా శక్తి పథకం అమలులో లేదు
SCROLL   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2026-01-13 16:35:40 0 163
Andhra Pradesh
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి..
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి  చీరాల: చీరాల పట్టణంలోని మార్కస్...
By Gadiyapudi Narendra 2025-12-24 14:14:52 0 203
Andhra Pradesh
ఇంటిగ్రిటీ నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ ఐజిపి ఏపీ ఈగల్ చీఫ్
🧑‍✈️🧑‍✈️🧑‍✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*. -...
By KOTESWARARAO KVSR 2025-12-22 16:46:52 0 176
Andhra Pradesh
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
చింతూరు: స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం పొందేందుకు...
By Shyamala Yadagiri 2026-04-22 02:25:28 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com