ఆ స్నేహితులు మద్యానికి బానిసలు, ముఠాగా ఏర్పడి దారిదోపిడిలు- అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
219

సికింద్రాబాద్ : మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడిలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఉత్తర మండల పరిధిలోని బేగంపేట,మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కత్తులతో బెదిరించి అమాయకుల నుండి దారిదోపిడిలకు పాల్పడుతున్న ఐదు మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు. నిందితుల నుండి రెండు కత్తులు, రెండు సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కేసులలో కార్ఖానా కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ప్రధాన సూత్రధారిగా జేబీఎస్ ,మడ్ ఫోర్డ్ ప్రాంతాలకు చెందిన నరసింహ, కార్తీక్, పరశురాం, శివ లు నేరానికి సహకరించినట్లు డిసిపి తెలిపారు. వీరంతా మధ్యానికి బానిసలుగా మారి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు ఒడిగట్టినట్లు స్పష్టం చేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి విధులు ఊహించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో జేబీఎస్ వద్ద అతనిని అడ్డగించి కత్తులతో బెదిరించి 18 వేల రూపాయలను లాక్కొని పరారైనట్లు తెలిపారు. మరొక ఘటనలో పరేడ్ మైదానం వద్ద తన స్నేహితుని ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న అన్సారి అనే వ్యక్తిపై ఆటోలో వచ్చిన దుండగులు కత్తి తో దాడికి పాల్పడి అతని వద్ద ఉన్న ఆరువేల రూపాయలను అపహరించుకొని ఆటోలో పరారయ్యారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ దారిదోపిడీలు ఒకే ముఠా చేసిన పనిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Telangana
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్...
By Bittu Bittu 2026-04-11 12:43:41 0 851
Andhra Pradesh
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
By Pagadala Venkateswar 2026-03-16 07:05:40 0 131
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 145
Telangana
ఎమ్మెల్యే ని కలిసిన ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ వాసులు
 మచ్చ బొల్లారం డివిజన్ ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పవన్...
By Sidhu Maroju 2025-06-15 16:46:30 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com